భారతదేశం, ఆగస్టు 17 -- ఆటో కాంపోనెంట్స్ తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన ధూత్ ట్రాన్స్‌మిషన్ ఐపీఓకు దేశీయ స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్ లభించింది! ఇష్యూ ధర రూ. 871తో పోలిస్తే ఎన్ఎస్ఈలో ఒక్కో షేరు 37.77 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడింగ్​ని ప్రారంభించింది. ఇక బీఎస్ఈలో 37.06 శాతం లాభపడి రూ. 1,193.80 వద్ద ఓపెన్ అయింది.

ఇక సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో ధూత్​ ట్రాన్స్​మిషన్ షేరు రూ. 1,149 వద్ద ట్రేడ్​ అవుతోంది.

పెట్టుబడిదారుల నుంచి ఈ ఐపీఓకి అపూర్వమైన స్పందన లభించింది. గత బుధవారంతో ముగిసిన బిడ్డింగ్ చివరి నాటికి ఈ ఇష్యూ ఏకంగా 74.21 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం రూ. 3,067 కోట్ల విలువైన ఈ ఐపీఓలో 2,49,56,363 షేర్లకు గాను ఏకంగా 1,85,19,71,585 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

విభాగాల వారీగా చూస్తే, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బ...