భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనకు శనివారం సర్జరీ జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సినీ, రాజకీయ ప్రముఖలు ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆదివారం పవన్ కల్యాణ్‌కు స్వయంగా ఫోన్ చేసిన ప్రధాని. ఆయన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాల గురించి మోడీ ఆరా తీశారు. దాదాపు నిమిషం పాటు సాగిన ఈ సంభాషణలో పవన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రజా సేవలో నిరంతరం శ్రమించే క్రమంలో ఆరోగ్యంపై కూడా దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించినట్లు సమాచారం.

ఫోన్ కాల్ మాత్రమే కాకుండా. ప్రధాని మోద...