Delhi crime news : 1984 నాటి మర్డర్ కేసు- 42ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు!
భారతదేశం, ఆగస్టు 23 -- నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎట్టకేలకు పట్టుకుంది! ఫలితంగా పోలీసుల సుదీర్ఘ వేటకు ఎట్టకేలకు తెరపడింది. ఆ నిందితుడి పేరు నత్తు అలియాస్ నత్తులాల్ (65). ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లా అతని స్వస్థలం. 1984లో దిల్లీలోని జనక్పురి పోలీస్ స్టేషన్లో అతనిపై తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి అతను పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.
ఈ దారుణ ఘటన 1984 మే 22, 23 మధ్య రాత్రి జరిగింది. ఆ రోజు పశ్చిమ దిల్లీలోని వికాస్పురి డిస్ట్రిక్ట్ పార్క్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు. అతడిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా చంపేశారు. విచారణలో ఆ మృతుడు యూపీలోని సీతాపూర్కు చెందిన అశోక్ కుమార్గా అప్పట్లో పోలీసులు తేల్చారు.
కేసు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.