భారతదేశం, ఆగస్టు 23 -- నాలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని దిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎట్టకేలకు పట్టుకుంది! ఫలితంగా పోలీసుల సుదీర్ఘ వేటకు ఎట్టకేలకు తెరపడింది. ఆ నిందితుడి పేరు నత్తు అలియాస్ నత్తులాల్ (65). ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లా అతని స్వస్థలం. 1984లో దిల్లీలోని జనక్‌పురి పోలీస్ స్టేషన్‌లో అతనిపై తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి అతను పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.

ఈ దారుణ ఘటన 1984 మే 22, 23 మధ్య రాత్రి జరిగింది. ఆ రోజు పశ్చిమ దిల్లీలోని వికాస్‌పురి డిస్ట్రిక్ట్ పార్క్‌లో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు. అతడిని కత్తులతో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా చంపేశారు. విచారణలో ఆ మృతుడు యూపీలోని సీతాపూర్‌కు చెందిన అశోక్ కుమార్‌గా అప్పట్లో పోలీసులు తేల్చారు.

కేసు ...