భారతదేశం, ఏప్రిల్ 22 -- DA Hike News: పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి వర్తించేలా కరువు భత్యం (Dearness Allowance - DA)ను పెంచుతూ ఏప్రిల్ 22న డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ కీలక ప్రకటన చేసింది. తాజా పెంపుతో కేంద్ర ఉద్యోగుల డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి చేరుకుంది.

గత ఏడాది అక్టోబర్ 6న సిద్ధం చేసిన ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో, ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. అంటే, ఉద్యోగులకు జనవరి నుంచి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా లభిస్తాయి.

7వ వేతన సంఘం (7th CPC) సిఫార్సుల ప్రకారం నిర్ణయించిన పే మేట్రిక్స్‌లోని లెక్కల ఆధారంగానే ఈ పెంపు ఉంటుంది. ఇందులో కేవలం 'బేసిక్ పే'ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు...