Crime News : సూర్యాపేట జంట హత్యల కేసు - కానిస్టేబుల్ అరెస్ట్, వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
భారతదేశం, ఆగస్టు 14 -- తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే గ్రామం సరిహద్దుల్లో సంచలనం సృష్టించిన దంపతుల జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు అతని అనుచరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 11వ తేదీ రాత్రి మోతే గ్రామం వెలుపల ఉన్న ఒక వ్యవసాయ పొలంలో సుమారు 40 ఏళ్ల వయస్సున్న భార్యాభర్తలు దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు వారి మృతదేహాలు సగం పూడ్చిపెట్టిన స్థితిలో ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను వెలికితీసి, దర్యాప్తు ప్రారంభించాయి.
కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. జంట హత్యలు జరిగిన 24 గంటల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.