భారతదేశం, మే 24 -- హిందూ మతంలో గరుడ పురాణం జీవితం, కర్మ, మరణం, వాటి పరిణామాలను వివరించే ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు. ప్రస్తుత జీవితంలో చేసిన మంచి చెడు కర్మల ఆధారంగా మరుజన్మ గురించి గరుడ పురాణం చెబుతోంది. గరుడ పురాణం ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసే ప్రతి మంచి, చెడు కర్మలకు, శిక్ష లేదా బహుమతి రూపంలో పరిణామాలను ఎదుర్కొంటాడు. అంతేకాకుండా ఒక వ్యక్తి కర్మలు వారి తరువాతి జన్మను ప్రభావితం చేస్తాయి.

ఒక వ్యక్తి తప్పుడు కర్మలు చేసినప్పుడు.. మరణానంతరం ఒక జంతువుగా, చాలా దుస్థితిలో పునర్జన్మిస్తారు. గరుడ పురాణం ప్రకారం కీటకాలు, బొద్దింకలుగా పునర్జన్మిస్తారు. గరుడ పురాణం ప్రకారం తన జీవితకాలంలో ఏ రూపంలోనైనా నూనెను దొంగిలించే వ్యక్తి మరణానంతరం నరకానికి వెళ్తాడు. వారి తదుపరి జీవితంలో అటువంటి వ్యక్తి కీటకాల ప్రపంచంలో, ప్రత్యేకంగా బొద్దింకగా ...