భారతదేశం, జూలై 20 -- CM Revanth Reddy Review On SIR : తెలంగాణలో సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రక్రియలో జిల్లాల నేతలు చురుగ్గా పాల్గొనకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తులో కార్పొరేషన్ చైర్మన్ పదవులు లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు దక్కవని తేల్చి చెప్పారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నియోజకవర్గ ఇన్‌చార్జులు ప...