భారతదేశం, జూన్ 5 -- CM Chandrababu Cycle Rally Vizag : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ (పచ్చదనం) సాధించడమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. రోజురోజుకూ గ్లోబల్ వార్మింగ్ కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతోనే ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు అకాల తుఫానులు ముంచెత్తుతున్నాయని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైనా ఉందని పిలుపునిచ్చారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడు...