భారతదేశం, జూన్ 6 -- Chepa Prasadam 2026 : హైదరాబాద్‌ నగరంలో శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం, ప్రజల నమ్మకమైన మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీ (జూన్ 8) రాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరుండి పర్యవేక్షించారు. శనివారం వారు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీకేడ్లు, క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుంది. కానీ.. ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట వచ్చే ప్రజలకు, దేశంలోని ఇతర రాష్ట్రాల...