భారతదేశం, మార్చి 16 -- బాలీవుడ్ నటి, మంచు విష్ణు మూవీ సూర్యం హీరోయిన్ సెలీనా జైట్లీ తన సోదరుడి కోసం చేస్తున్న న్యాయపోరాటానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో గత కొంతకాలంగా నిర్బంధంలో ఉన్న తన సోదరుడు విక్రాంత్ జైట్లీని కలిసేందుకు, అతనికి న్యాయ సహాయం అందించేందుకు అనుమతించాలని కోరుతూ సెలీనా జైట్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

మార్చి 16న ఈ కేసును విచారించిన జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం సంచలన విషయాలను వెల్లడించింది. విక్రాంత్ జైట్లీకి ఇప్పటికే కాన్సులర్ యాక్సెస్ (దౌత్యపరమైన అనుమతి) లభించిందని, అయితే అతను తన సోదరి సెలీనాతో మాట్లాడటానికి సిద్ధంగా లేనని స్పష్టం చేసినట్లు కోర్టు పేర్కొంది.

"తన సోదరి పంపే ఏ రకమైన న్యాయ సహాయాన్ని తీసుకోవడానికి విక్రాంత్ ఇష్టపడటం లేదు. తన భార్య చారుల్ జైట...