భారతదేశం, ఆగస్టు 11 -- ఢిల్లీ వేదికగా సాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఛేదించారు. నకిలీ కాల్ సెంటర్లను నడుపుతూ, తెలంగాణకు చెందిన అమాయక ప్రజలను టార్గెట్ చేసి కోట్ల రూపాయలు కాజేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు.

ఈ విచారణలో భాగంగా ఢిల్లీలోని మూడు వేర్వేరు కాల్ సెంటర్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు.. 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలికాలర్లతో పాటు మోసాలకు సహకరించిన ఒక బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ముగ్గురు కీలక సూత్రధారులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఢిల్లీలోని శివ మార్కెట్ కేంద్రంగా ఈ సైబర్ దందా సాగుతోంది. లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు ...