భారతదేశం, మార్చి 7 -- బాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి 'యానిమల్' సినిమాతో విలన్‌గా భారీ విజయాన్ని అందుకున్న నటుడు బాబీ డియోల్. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలోనూ విలన్‌గా అదరగొట్టిన బాబీ డియోల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోనూ తన జోరు చూపిస్తున్నారు.

ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో గల ఒక ప్రముఖ బిజినెస్ పార్క్‌లో బాబీ డియోల్, ఆయన భార్య తాన్యా డియోల్ భారీ పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి భాగస్వామ్యంలో ఉన్న 'గ్రీన్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ ద్వారా సుమారు 3,400 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఐదు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను కొనుగోలు చేశారు.

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం, అంధేరీ వెస్ట్‌లోని లింక్ రోడ్‌లో ఉన్న 'యురా బిజినెస్ పార్క్ - ఫేజ్ 2' లోని రెండో అంతస్తులో ఈ 5 ఆఫీసులను బాబీ డియోల్ దంపతులు కొన్నారు. ఈ డీ...