భారతదేశం, మార్చి 28 -- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.

వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పట్టాభిషేక వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేశ నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన భక్తులతో మిథిలా ప్రాంగణం రామనామ స్మరణలతో మార్మోగింది. వసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకట్రావు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఈ ఉత్సవాన్ని తిలకించారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో తాగునీరు, ప్రసాదాలు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా ...