భారతదేశం, ఆగస్టు 6 -- బీసీ రక్షణ చట్టంతో వెనబడిన వర్గాలు గౌరవ ప్రదంగా సామాజిక జీవనం కొనసాగించేలా రక్షణ కల్పిస్తున్నామని, కులం, వృత్తుల పేరుతో దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం రూపొందిస్తున్నామని మంత్రులు ఎస్.సవిత, అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ చట్టంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకున్నామని, త్వరలో జిల్లా స్థాయిలోనూ బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు.

బీసీ ముసాయిదా రక్షణ చట్టం జాతీయ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళతామని, అక్కడ అనుమతి రాగానే అసెంబ్లీలో ఆమోదానికి ప్రవేశపెడతామని మంత్రి సవిత తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా బీసీ రక్షణ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బీసీ ముసాయిదా రక్షణ చట్టంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్...