భారతదేశం, ఏప్రిల్ 6 -- దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత సరస్వతీ దేవి ఆలయానికి బాసర ఎంతో ప్రసిద్ధి. అక్షరాభయాసానికి ప్రసిద్ధ కేంద్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్ధశ రానుంది. ఈ ఆలయాన్ని పునరాభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 225 కోట్లతో పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేస్తారు.

వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం అభివృద్ధి.. ధ్యాన మందిరాలతో మ‌రింత‌గా భ‌క్తుల మ‌నస్సుల‌ను ఆకట్ట‌కోనుంది. వేల ఏళ్ల ఘ‌న చ‌రిత్ర గ‌ల్గిన బాసర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునః నిర్మాణాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.225 కోట్ల‌ను కేటాయించింది. పునరాభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ రూపొంది...