భారతదేశం, మే 16 -- Bandi Bhagirath POCSO Case : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా విచారణకు దూరంగా ఉన్న బండి భగీరథ్.. తన న్యాయవాదులతో కలిసి స్టేషన్‌కు వచ్చి విచారణకు హాజరయ్యారు.

ఈ పరిణామంపై భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. చట్టంపై ఉన్న గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. "సత్యమేవ జయతే.. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. మనమందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే," అని బండి సంజయ్ పేర్కొన్నారు.

తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడని. వాస్తవానికి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులకు అప్పగించాలని భావించినట్లు మంత్రి తెలిపారు. అయితే...