భారతదేశం, జూన్ 20 -- Bandi Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు ఆయనకు ఏడు రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ మంజూరు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో భగీరథ్ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

బండి సాయి భగీరథ్ తన చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున.. పరీక్షలు రాసుకునేందుకు వీలుగా కోర్టు ఈ తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిందని సమాచారం. కేవలం ఏడు రోజుల కాలపరిమితికి మాత్రమే పరిమితమైన ఈ బెయిల్ కోసం న్యాయస్థానం పలు కఠినమైన షరతులను కూడా విధించినట్లు తెలుస్తోంది.

దాదాపు నెలరోజుల పాటు చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్‌ ఇవాళ మధ్యాహ్నం విడ...