భారతదేశం, మార్చి 9 -- పశ్చిమాసియాలో ఘర్షణలు ఆంధ్రా అరటి పండ్ల మీద పడుతోంది. ఘర్షణల నేపథ్యంలో అరటిపండ్ల ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోతారని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షపాతం, కరువు, మధ్యవర్తుల ప్రభావం వంటి కారణాల వల్ల ఇటీవలి సంవత్సరాలలో అరటి ధరలు విస్తృతంగా హెచ్చుతగ్గులను చూస్తున్నాయి. కొన్ని నెలల క్రితం గణనీయంగా తగ్గాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నుండి ధరలు పెరగడం ప్రారంభించాయి. ఇది కాస్త రైతులకు ఉపశమనం కలిగించింది.

కానీ పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధరలు మరోసారి తగ్గడం ప్రారంభించాయి. ఈ-క్రాప్ డేటా ప్రకారం కడప జిల్లాలో అరటి సాగు దాదాపు 13,820 హెక్టార్లలో విస్తరించి ఉంది.

ఒక ఎకరంలో అరటి పంటను పండించడానికి రైతులు సగటున దాదాపు రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తారు. పంట బాగా వస్తే.. దిగుబడి ఎకరానికి ...