భారతదేశం, మే 24 -- పాకిస్థాన్‌లోని అశాంతి నిండిన నైరుతి ప్రావిన్స్ బలూచిస్థాన్ రాజధాని క్వెట్టాలో ఘోర బాంబు పేలుడు సంభవించింది. సైనిక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో వెళుతున్న ఒక రైలును లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. క్వెట్టాలోని చమన్ పట్టక్ సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు.. రైలు బోగీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భీకర ఆత్మాహుతి దాడిలో కనీసం 24 మంది మరణించగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్​ఏ) ప్రకటించింది.

ఈద్ (రంజాన్) పండుగ వేడుకల కోసం క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పెషావర్ వెళుతున్న సైనికులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బలూచ్ తిరుగుబాటుదారులు ఈ దారుణానికి ఒడిగట్టారు. మంగళవారం నుంచి ఈద్ సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైలులో రద్దీ ఎక్కువ...