Assam Air Force Plane Crash : కూలిపోయిన వాయుసేన AN-32 విమానం - ఐదుగురు మృతి
భారతదేశం, జూన్ 13 -- Indian Air Force Plane Crash Assam : భారత వైమానిక దళంలో (IAF) తీవ్ర విషాదం నెలకొంది. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో శనివారం జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదంలో ఐదుగురు ఐఏఎఫ్ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. వాయుసేనకు చెందిన ఏఎన్-32 (AN-32) రవాణా విమానం సాధారణ శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కాసేపటికే సాంకేతిక లోపంతో కూలిపోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
అస్సాంలోని జోర్హాట్ ప్రాంత సమీపంలో ఈ ప్రమాదం సంభవించినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఐఏఎఫ్ తన అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. సాధారణ శిక్షణ ఫ్లైట్ సమయంలోనే ఈ విమానం నియంత్రణ కోల్పోయి నేలకూలిందని వాయుసేన ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.