భారతదేశం, ఏప్రిల్ 12 -- పీఎం ఈ-బస్ సేవా పథకం కింద ఏపీలోని 11 నగరాలకు కేంద్ర ప్రభుత్వం 750 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటి నిర్వహణ కోసం ఈవీ ఛార్జింగ్ పాయింట్ల విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. 11 నగరాల్లో తిరగనున్న 750 ఈ-బస్సులను రీఛార్జ్ చేసేందుకు, ఏపీఎస్ఆర్టీసీ తన 12 డిపోలలో ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్, సివిల్ పనులను చేపడుతోంది.

మూడు నెలల్లోగా ఆంధ్రప్రదేశ్‌లో 750 ఎలక్ట్రిక్ బస్సులన్నీ నడుస్తాయని మేం ఆశిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎ. అప్పల రాజు అన్నారు.

విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు నగరాలకు 100, కాకినాడ, రాజమహేంద్రవరం, అమరావతి, కడప, తిరుపతి, కర్నూలు, అనంతపురం నగరాలకు 50 చొప్పున ఈ-బస్...