భారతదేశం, జూలై 9 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) కృష్ణబాబు స్పష్టం చేశారు. కేవలం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామే తప్ప, సంస్థను ప్రైవేట్ పరడం చేయడం లేదని ఆయన వివరించారు.

"ఆర్టీసీ ప్రైవేటీకరణ కావడం లేదు. సంస్థ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం లేదు. ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్నే మనం కూడా ఏపీలో అనుసరిస్తున్నాం," అని కృష్ణబాబు వివరించారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'పీఎం ఈ-బస్ సేవా' పథకం కి...