భారతదేశం, ఆగస్టు 19 -- ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే పర్యావరణ పరిరక్షణను సమతుల్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల ఆవరణలో కనీసం 33 శాతం పచ్చదనాన్ని (Green Cover) తప్పనిసరిగా నిర్వహించేలా చూడటానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ప్రణాళికలో భాగంగా మొదటి విడత కింద ప్రతి జిల్లా నుండి ఒక పరిశ్రమ చొప్పున ఎంపిక చేసి 14 రోజుల ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు.

జూలై 28 డ్రైవ్ ప్రారంభమై..ఆగస్టు 11న ముగిసింది. 26 జిల్లాల్లోని 26 పరిశ్రమ 43,300 మొక్కలు నాటారు. 129 ఎకరాల విస్తీర్ణం కవర్ చేశారు. ఈ డ్రైవ్‌లో ఎంపిక చేసిన అన్ని 26 పరిశ్రమలు కేటాయించిన 14 రోజుల గడువులోనే తమ పచ్చదనం లక్ష్యాలను విజయవంతంగా సాధించాయి.

ఈ కార్యక్రమంలో కేవలం సాధా...