భారతదేశం, ఏప్రిల్ 8 -- ప్రజలపై అదనపు భారం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. విజ‌య‌వాడలోని గుణ‌ద‌ల‌లో రూ.35 కోట్లకు పైగా వెచ్చించి నిర్మించిన ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాల‌యాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు... రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

'ఉద్యోగుల కృషితో పనితీరు కారణంగా విద్యుత్ శాఖకు మంచి పేరు వచ్చింది. అంత‌రాయాలు, లో ఓల్టేజ్ సమస్యలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా విద్యుత్ శాఖ పని చేస్తోంది. పీఎం సూర్యఘ‌ర్, పీఎం కుసుమ్ వంటి ప‌థ‌కాల‌ అమ‌లులో కూడా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. సీఎం చంద్రబాబు...