భారతదేశం, జూలై 13 -- Rayanapadu Railway Station Development : విజయవాడ పరిసర ప్రాంతాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద సర్వాంగ సుందరంగా ముస్తాబైన రాయనపాడు రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రూ.35 కోట్లకు పైగా భారీ వ్యయంతో పునర్నిర్మించిన ఈ అత్యాధునిక రైల్వే స్టేషన్‌ను జూలై 17వ తేదీన ప్రారంభించనున్నారు.

రైల్వే మంత్రిత్వ శాఖ సమన్వయంతో, పక్కా ప్రణాళికతో ఈ స్టేషన్‌ను ఆధునీకరించారు. విజయవాడ ప్రధాన రైల్వే జంక్షన్‌పై ప్రయాణికుల రద్దీ ఒత్తిడిని తగ్గించడానికి రాయనపాడు ఒక అద్భుతమైన శాటిలైట్ టెర్మినల్‌గా మారనుంది. ఇక్కడి నుంచి ప్రతిరోజూ కొన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు సుమారు 12 రైళ్లు నడుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

అమృత్ భారత్ పథకంలో భాగ...