భారతదేశం, ఏప్రిల్ 12 -- అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన నలుగురు చిన్నారులను మృత్యువు కబళించింది. మత్స్యగెడ్డ వాగులో నీట మునిగి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోగా, ఒకరు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రాథమిక వివరాల ప్రకారం. పన్నెడా గ్రామానికి చెందిన నలుగురు బాలురు మత్స్యగెడ్డ వాగుకు వెళ్లారు. చేపలు పట్టడంతో పాటు ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. వీరిలో నలుగురు ప్రమాదవశాత్తు మునిగిపోగా.. మరొకరు బయటకు వచ్చి సహాయం కోసం కేకలు వేశారు. సమీపంలోని మత్స్యకారులు తక్షణమే స్పందించి.. ఒకరిని కాపాడగలిగారు. మిగిలిన ముగ్గురూ ప్రాణలు కోల్పోయారు.

హర్షిత్‌ (12), ప్రదీప్‌ (11), పాంగి బబులు (10)గా మృతులుగా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అల...