భారతదేశం, ఏప్రిల్ 20 -- భారతీయ టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్నప్పటికీ, కంపెనీలు తమ ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు చడీచప్పుడు లేకుండా షాకిచ్చింది. మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఎంచుకునే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను పెంచడంతో పాటు, ఒక పాపులర్ ప్లాన్‌ను మార్కెట్ నుండి తొలగించింది.

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు అందించే 84 రోజుల ప్లాన్ ధరను పెంచింది. గతంలో ఈ ప్లాన్ రూ. 859 కి లభించేది, కానీ ఇప్పుడు దీని కోసం వినియోగదారులు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నేరుగా రూ. 40 భారం పెరిగింది.

గమనిక: గతంలో ఈ ప్లాన్‌తో లభించిన 'రివార్డ్స్ మినీ' (RewardsMini) సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఇప్పుడు తొలగించింది.

ధరల పెంపుతో పాటు, ఎయిర్‌టెల్ మరో కీలక నిర్ణయం తీస...