భారతదేశం, జూలై 6 -- AICTE Engineering Colleges Closed : దేశంలో ఇంజినీరింగ్, సాంకేతిక విద్యా రంగానికి సంబంధించి ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) కీలక విషయాలను వెల్లడించింది. 2025-26 విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్, టెక్నికల్ కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య తగ్గడం, మౌలిక వసతుల లేమి, నిబంధనల ఉల్లంఘన వంటి వివిధ కారణాల వల్ల ఈ విద్యాసంస్థలను మూసివేయాల్సి వచ్చినట్లు ఏఐసీటీఈ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ విద్యాసంస్థల మూసివేత 'ప్రోగ్రెసివ్ క్లోజర్' (క్రమంగా మూసివేసే) పద్ధతిలో జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకారం.. సదరు కాలేజీలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో కొత్తగా ఎలాంటి అడ్మిషన్లు తీసుకోకూడదు. కానీ, ఇప్పటికే ఆయా కాలేజీల్లో చదువుతున్న పాత విద్యార్థులు తమ డిగ్రీలను ఎలాంటి అభ్యంత...