భారతదేశం, మే 21 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పాలిట వరంగా భావించే 8వ వేతన సంఘం (8th Pay Commission) అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే ఈ కమిషన్ వివిధ రంగాల నిపుణులను కన్సల్టెంట్లుగా నియమించుకునే ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు, ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలను, వినతులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని మూడు ప్రధాన ఉద్యోగ సంఘాలైన NC-JCM, AIDEF, మహారాష్ట్ర ఓల్డ్ పెన్షన్ ఆర్గనైజేషన్ తమ డిమాండ్ల చిట్టాను కమిషన్ ముందు ఉంచాయి.

కరువు భత్యం (DA) పెంపు నుంచి పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ వరకు ఈ సంఘాలు చేసిన ప్రతిపాదనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సవరణలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) అత్యంత కీలకం. పాత బేసిక్ పేను కొత్త బేసిక్ పేగా మార్చేందుకు ఈ గుణకాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇది...