భారతదేశం, జూలై 1 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) కసరత్తు ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ జూలై నెలలో కమిషన్ పలు ప్రాధాన్యత కలిగిన సమావేశాలను నిర్వహించనుంది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల జీతాల సవరణ, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, అలవెన్సుల మార్పులపై ఈ సమావేశాల్లో కీలక చర్చలు జరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీని మొత్తం కాలపరిమితి 18 నెలలు కాగా, ఇప్పటికే దాదాపు ఎనిమిది నెలల సమయం ముగిసింది. ప్రభుత్వానికి తన తుది నివేదికను సమర్పించడానికి కమిషన్‌కు మరో 10 నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వివిధ భాగస్వామ్య పక్షాలతో (స్టేక్‌హోల్డర్స్) సంప్రదింపులు జరపడం, ప్రస్తుత వే...