భారతదేశం, జూన్ 16 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ (8th Pay Commission) నివేదిక సమీపిస్తున్న వేళ, ఉద్యోగ సంఘాలు సరికొత్త డిమాండ్లను తెరపైకి తెచ్చాయి. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థిక ఆసరాగా నిలిచే అత్యంత కీలకమైన 'గ్రాట్యుటీ' (Gratuity) నిబంధనలలో మార్పులు చేయాలని వివిధ కార్మిక సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాయి. గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని భారీగా పెంచడం, లెక్కింపు విధానాన్ని సవరించడం, మరణానంతర ప్రయోజనాలను మెరుగుపరచడం వంటి అంశాలు ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా ఉన్నాయి.

కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ ప్రయోజనం లభిస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగానే మరణిస్తే, వారి కుటుంబానికి డెత్ గ్రాట్యుటీ అం...