భారతదేశం, మార్చి 23 -- కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం.. ప్రపంచ దేశాలపై పడుతోంది. ఇరాన్తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొననాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 5 రోజులపాటు దాడులు ఆపనున్నట్టుగా తెలిపారు. సమగ్ర పరిష్కారం కోసం అమెరికా, ఇరాన్లు చర్చలు జరిపాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
ఈ చర్చల ఫలితంగా ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్ఫ్రాపై మిలటరీ స్ట్రైక్స్ను వాయిదా వేస్తున్నట్టుగా ట్రంప్ వెల్లడించారు. శనివారం రాత్రి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ట్రంప్ ఇరాన్కు 48 గంటల గడువు ఇచ్చారు. లేకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను అమెరికా తుడిచిపెట్టేస్తుందని హెచ్చరించారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.