భారతదేశం, మే 26 -- రాష్ట్రంలో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏసీబీ దాడులు కొనసాగుతున్నా.. కొందరు అధికారుల తీరులో మార్పు రావడం లేదు. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలంలో భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారిణి పట్టుబడటం తీవ్ర సంచలనంగా మారింది.

నాలా(NALA) కన్వర్షన్ కోసం రూ. 30 లక్షల లంచం డిమాండ్ చేస్తూ.. ఓ లంచగొండి తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. మే 26, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 2:00 గంటల సమయంలో రంగారెడ్డి రేంజ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన మెరుపు దాడిలో ఈ బాగోతం వెలుగుచూసింది.

రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు అందించిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట మండల తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ టి. సుచరిత ఒక భూమి వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేశారు. సుమారు 30 ఎకరాల వ్యవస...