భారతదేశం, మే 18 -- నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ఇప్పుడు దేశవ్యాప్తంగా 'బివాల్ కుటుంబం' పేరు మారుమోగిపోతోంది. రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన ఈ కుటుంబం, పేపర్ లీక్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ (CBI) ఆధారాలు సేకరించింది. ఈ కేసులో దినేష్ బివాల్, అతని సోదరుడు మాంగీలాల్ బివాల్, మాంగీలాల్ కొడుకు వికాస్ బివాల్‌ను ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కథలో అత్యంత విచిత్రమైన మలుపు దినేష్ బివాల్ కొడుకు రిషి మార్కులు. తన కొడుకును ఎలాగైనా డాక్టర్‌ను చేయాలన్న తాపత్రయంతో దినేష్ బివాల్.. హర్యానాకు చెందిన యశ్ యాదవ్ అనే వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయలు పోసి నీట్ ప్రశ్నపత్రాన్ని కొన్నాడు. పరీక్షకు ముందే చేతికి పేపర్ వచ్చింది.. ఏ ఏ ప్రశ్నలు వస్తాయో ముందే తెలుసు. కానీ, తీరా ఫలితాలు వచ్చేసరికి రిషికి వచ్చింది కేవలం 720 మార్కులకు గానూ 107 మార్క...