భారతదేశం, ఆగస్టు 21 -- దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లొంబార్డ్ (ICICI Lombard) ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను దక్కించుకుంది. సంస్థ 25వ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని 2026 ఆగస్టు 10న న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో కేవలం 12 గంటల్లో 25,468 హెల్మెట్లను పంపిణీ చేసి ఈ అరుదైన ఘనతను నమోదు చేసింది.

న్యూఢిల్లీలోని 13 పాఠశాలలతో సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఏకకాలంలో చేపట్టారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఈ హెల్మెట్లను అందజేశారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రహదారి భద్రతా అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐసీఐ లొంబార్డ్ సీనియర్ అధికారులు, ప్రభుత్వ, పోలీసు శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ...