భారతదేశం, జూలై 14 -- నవీ ముంబైలోని ఐరోలి ప్రాంతంలో నివసించే 50 ఏళ్ల బలిరామ్ సూర్యనాథ్ కుష్వాహా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. భర్త ఏమయ్యాడో తెలియదంటూ భార్య సునిత అందరినీ నమ్మించింది. ఇరుగుపొరుగు, బంధువులు కూడా అది నిజమేనని భావించారు. కానీ, కళ్ల ముందే తిరుగుతున్న ఆ నిశ్శబ్ద వాతావరణం వెనుక ఒక భయంకరమైన హంతకురాలు దాగి ఉందనే నిజం 11 నెలల వరకు ఎవరికీ తెలియలేదు. ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన ఈ హత్యోదంతం చివరకు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

బలిరామ్ భార్య సునిత (40)కు రాహుల్ దశరథ్ ప్రజాపతి (30) అనే ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరిద్దరి రహస్య బంధం కాస్తా బలిరామ్‌కు తెలిసింది. భార్య ప్రవర్తనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు, ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. తమ సుఖానికి అడ్డు వస్తున్న బలిరామ్‌ను శాశ్వతంగా వదిలించుకోవాలని ఆ...