భారతదేశం, జూన్ 10 -- తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే నడుస్తున్న స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ-కర్ణాటక మధ్య కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు అన్‌రిజర్వ్‌డ్ అని వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగుకుండా ఈ మేరకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.

ఇందులో భాగంగా కొత్తగా హైదరాబాద్-వాడి మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అనౌన్స్ చేసింది. ఇవి అన్‌రిజర్వ్‌డ్ ట్రైన్స్ అని స్పష్టంగా చెప్పింది. సాధారణ ప్రజలు ఈ రూట్‌లో హాయిగా ప్రయాణించవచ్చు. మెుత్తం 4 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జూన్ 29వ తేదీన ఈ రైళ్లు ప్రారంభమవుతాయి.

07175 హైదరాబాద్-వాడి మధ్య రైలు జూన్ 29వ తేదీన సోమవారం హైదరాబాద్‌లో ఉదయం 9.30 గంటలకు బయల్దే...