భారతదేశం, ఆగస్టు 12 -- హైదరాబాద్ మహానగరంలో రోజూ ఆఫీసులు, కాలేజీలు, ఇతర వ్యాపార పనులకు వెళ్లేవారికి ద్విచక్ర వాహనాలు అత్యంత వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సాధనాలు. అయితే ఈ ప్రయాణంలో బైక్ రైడర్లు తీవ్రమైన కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి దూరం ప్రయాణించినా కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, తీవ్రమైన దురద, మంట లేదా కళ్లలో నస పుట్టడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవి ప్రారంభంలో చిన్న సమస్యలుగా అనిపించినా, దీర్ఘకాలంలో కంటి ఆరోగ్యంతో పాటు ప్రయాణంలో ఏకాగ్రతను దెబ్బతీసి రోడ్డు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.

నగరంలో విస్తృతంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలు, పెరిగిన వాహన రద్దీ ద్విచక్ర వాహనదారులకు సవాళ్లు విసురుతున్నాయి. ఎండ, పొడి వాతావరణంలో రోడ్లు, నిర్మాణ ప్రాంతాల నుంచి ఎగసిపడే సూక్ష్మ ధూళి కణాలు నేరుగా కళ్లలోకి చేరుతున్నాయి. మరోవైపు ట...