భారతదేశం, ఏప్రిల్ 18 -- హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ వద్ద ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బస్సు సిబ్బంది సత్వర స్పందనతో మంటలు వాహనాన్ని పూర్తిగా ఆక్రమించక ముందే బస్సులోని సుమారు 20 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.

శుక్రవారం రాత్రి కేపీహెచ్‌బీలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది మంటలు వ్యాపించకముందే ప్రయాణికులను కిందకు దించడంతో పెద్ద పెను ప్రమాదాన్ని నివారించారు.

స్థానిక నివాసితులు, పోలీసుల కథనం ప్రకారం శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు మియాపూర్ నుండి బయలుదేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లు వెళ్లే మార్గమధ్యంలో ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ సంఘటన జరిగిం...