భారతదేశం, జూన్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, చట్టబద్ధ పాలన స్థానంలో భీతావహ పాలన సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలు అత్యంత భయపడేది పోలీసులకేనా అనే దుస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న కస్టడీ మరణాలు, ఆత్మహత్యలపై శనివారం హాలో ఇండియా పేరుతో ఓ ప్రకటన విడుదల చేశారు.

గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అలాగే పోలీసుల వేధింపుల తట్టుకోలేక క్రాంతి కుమార్‌ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఇలాంటి సంఘటనలు కేవలం యాదృచ...