భారతదేశం, మార్చి 12 -- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు విరుచుకుపడుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు హోరాహోరీగా తలపడుతుండటంతో గల్ఫ్ దేశాల మధ్య ఉన్న హార్మూజ్ జలసంధి నిప్పుల కొలిమిలా మారింది. గత కొద్ది రోజులుగా ఈ మార్గంలో ప్రయాణించే చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.

తాజాగా, బుధవారం నాడు థాయ్‌లాండ్ పతాకంతో భారత్‌కు వస్తున్న 'మయూరీ నారీ' (Mayuree Naree) అనే సరుకు రవాణా నౌకపై ఒమన్ తీరానికి సమీపంలో దాడి జరిగింది. ఇరాన్ జరిపినట్టుగా భావిస్తున్న ఈ దాడుల పరంపరలో ఇది 13వ ఘటన కావడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం వాటా ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన మార్గం. అయితే, ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఇ...