భారతదేశం, మార్చి 20 -- గుండె జబ్బులు అంటే కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చేవి అనే పాత నమ్మకాన్ని హర్యానాలో నమోదైన గణాంకాలు పటాపంచలు చేస్తున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం వెల్లడైన ఒక నివేదిక ఆరోగ్య రంగంలో కలకలం రేపుతోంది. గత ఆరేళ్ల కాలంలో హర్యానాలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 18,000 మంది గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. 2020 తర్వాత యువతలో గుండె సంబంధిత మరణాలు పెరగడానికి కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు లేదా వ్యాక్సినేషన్ సైడ్ ఎఫెక్ట్స్ కారణమా? అని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సర్వే లేదా పరిశోధన జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

2025లో ఎయిమ్స్ (AIIMS), ఐసీఎంఆర్ (ICMR) సం...