భారతదేశం, జూన్ 17 -- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయ బిజీ షెడ్యూల్‌లోనూ ఓ అభిమాని చివరి కోరికను మన్నించి, అతని ఇంటికి వెళ్లి పరామర్శించి పెద్ద దిక్కుగా నిలిచారు.

తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడు 'డి.ఎన్.డి' (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎదుగుదల లేక, కనీసం మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్న నిరంజన్.. తన కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆశపడ్డాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి చేరుకున్నారు.

మంచానికే పరిమితమైన నిరంజన్‌ను చూసి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ అభిమాని మంచం పైనే కూర్చుని, అతన్ని ఆత్మీయంగా హత్తుకున్నా...