భారతదేశం, జూన్ 23 -- పవిత్ర హజ్ యాత్ర-2027(Haj 2027)కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. యాత్రకు సంబంధించిన షెడ్యూల్, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాలను తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ అఫ్జర్ బియాబానీ అధికారికంగా విడుదల చేశారు. ముస్లిం సోదరులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

హజ్-2027 యాత్రకు వెళ్లాలనుకునే అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 22, 2026 నుంచే ప్రారంభమైందని ఛైర్మన్ వెల్లడించారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి జూలై 20, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తుదారుల వద్ద తప్పనిసరిగా అంతర్జాతీయ పాస్‌పోర్ట్ ఉండాలి. ఈ పాస్‌పోర్ట్ గడువు కనీసం డిసెంబర్ 31, 2027 వరకు చెల్లుబాటు అయ్యేలా ఉండాలని స్పష్టం చేశారు.

ఒక హజ్ కవర్ నెంబర్ కింద గరిష్టంగా ఐదుగురు వయోజన యాత్రిక...