భారతదేశం, సెప్టెంబర్ 4 -- దేశీయంగా అభివృద్ధి చేసే మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్‌ మ్యూనిషన్‌ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణపై రెండు సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందంపై డ్రోగో ఏరోస్పేస్ నుంచి సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్‌ బొంతు, ఎం ఐ ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ పూణే లో శుక్రవారం సంతకాలు చేశారు.

ఈ భాగస్వామ్యంలో డ్రోగో ఏరోస్పేస్‌ యూఏవీ ప్లాట్‌ఫామ్‌ రూపకల్పన, అభివృద్ధి, తయారీతో పాటు సంబంధిత ఖాళీ పేలోడ్‌ హార్డ్‌వేర్‌ అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించనుంది. మరోవైపు ఎంఐఎల్‌ తనకు ఉన్న రక్షణ మందుగుండు సామగ్రి, వార్‌హెడ్‌ సాంకేతికతలోని నైపుణ్యాన్ని అందించనుంది.

ఎంఐఎల్‌ భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ రంగ తయారీ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. 2021 లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బో...