భారతదేశం, మే 12 -- భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంగళవారం ఒక పీడకలలా మిగిలిపోయింది. గత వారం నుంచి కొనసాగుతున్న పతనం నేడు పతాక స్థాయికి చేరింది. సెన్సెక్స్ ఏకంగా 1,456 పాయింట్లు (1.92%) నష్టపోయి 74,559 వద్ద ముగియగా, నిఫ్టీ 436 పాయింట్లు (1.83%) కోల్పోయి 23,379 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు అయితే మరింత దారుణంగా 3 శాతం వరకు పడిపోయాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లు వరుసగా నష్టపోతుండటంతో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

గత బుధవారం (మే 6) నాటికి బిఎస్ఈ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ Rs.473 లక్షల కోట్లుగా ఉండగా, మంగళవారం నాటికి అది Rs.457 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద నుంచి Rs.16 లక్షల కోట్లు ఆవిరైపోయాయి. ఇందులో Rs.10 లక్షల కోట్ల నష్టం కేవలం మంగళ...