భారతదేశం, ఫిబ్రవరి 12 -- సోషల్ మీడియా వినియోగం పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై అమెరికాలో జరుగుతున్న ఒక చారిత్రక విచారణకు ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మోస్సేరి హాజరయ్యారు. బుధవారం లాస్ ఏంజిల్స్ కోర్టులో జరిగిన ఈ విచారణలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రజలు 'క్లినికల్‌'గా బానిసలవుతారనే (Clinical Addiction) భావనతో తాను ఏకీభవించనని స్పష్టం చేశారు.

మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ అధిపతిగా ఉన్న మోస్సేరి, 'క్లినికల్ అడిక్షన్'కు, 'సమస్యత్మాక వినియోగం' (Problematic Use) మధ్య తేడా ఉందని వాదించారు. "కొంతమంది తమకు ఇష్టం లేకపోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనిని మేము సమస్యత్మాక వినియోగంగా పరిగణిస్తాం. ఇది ఖచ్చితంగా జరుగుతోంది, దీనిని మేము ఒప్పుకుంటాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీనిన...