భారతదేశం, నవంబర్ 27 -- బంగాళాఖాతంలో వాతావరణం మారిపోయింది. 'సెన్యార్' తుఫాను అవశేషంగా భావిస్తున్న వాయుగుండం తీవ్ర రూపం దాల్చుతోంది. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర వాయుగుండం (Deep Depression) గురువారం నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
గత 6 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం గంటకు 17 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది శ్రీలంకలోని బట్టికలోవాకు ఆగ్నేయంగా 120 కి.మీ, హంబన్ టోటాకు తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీ, భారతదేశంలోని పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయంగా 640 కి.మీ, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 730 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
"రానున్న 3 గంటల్లో ఇది నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరం మీదుగా ఉత్తర-వాయువ్య దిశగా పయనించి, మరింత బలపడి తుఫాన్గా మారే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.