భారతదేశం, జూన్ 5 -- ప్రముఖ జ్యువెలరీ ఎగుమతి సంస్థ 'రాజేష్ ఎక్స్‌పోర్ట్స్' (Rajesh Exports) షేర్లు స్టాక్ మార్కెట్లో దారుణంగా పడిపోయాయి. కంపెనీ ఖాతాలలో ఆదాయాన్ని భారీగా పెంచి చూపించారనే ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరుపుతుండటంతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను వదిలించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఈ పరిణామాల మధ్య శుక్రవారం (జూన్ 5, 2026) నాటి ట్రేడింగ్‌లో ఈ స్మాల్-క్యాప్ స్టాక్ 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ. 99.45 వద్ద లాక్ అయింది.

కంపెనీ యాజమాన్యం ఇచ్చిన వివరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపలేకపోవడంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో వరుసగా రెండో రోజు కూడా కేవలం అమ్మకాల ఆర్డర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పతనంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేరు గత ఒక వారంలో 16 శాతం, ఒక నెలలో 17 శాతం, మూడు నెలల్లో 21 శాతం.. అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా 50 శాతం మేర విలువను కోల్పోయింది.

రాజ...